'ప్రియమైన ఆవార్ గీ' - బహుమతి పొందిన నా కథ

ఉదయిని అనే ఆన్లైన్ సాహిత్య పత్రిక వారు ఉగాది కి కథల పోటీ నిర్వహిస్తే అందులో పాల్గొన్నాను. ఎన్నాళ్ళ నుంచో నాకిష్టమైన పాటలు వింటున్నప్పుడల్లా వాటికో ప్రేమ లేఖ రాస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఉండేది. అలా పుట్టిందే 'ప్రియమైన ఆవార్ గీ'. ఈ కథ రాయడానికి నాకు ఎక్కువ సమయం పట్టింది. ఇప్పటి దాకా రాసిన కథల తో పోలిస్తే. కథా శిల్పం తో నేనొక రకంగా ఇందులో experiment చేసాను అని చెప్పచ్చు. మామూలు కథ లాగ కాక ఓ ఘజల్ పల్లవి చరణాల తో దీన్ని అల్లడం జరిగింది. ఘజల్ ని, కథని కలిపి చేసిన ఈ ప్రయత్నం నాకు సంతృప్తినిచ్చింది అనే చెప్పాలి (పొగరు అనుకోకపోతే). 250 పై చిలుకు కథలు వచ్చాయట. వాటిలో బహుమతి పొందిన ఒక కథ గా ఎంపిక అవ్వడం నిజంగా ఆనందాన్నిచ్చింది. ఈ పోటీ లో గెలిచిన కథలని పక్షానికి కొన్ని చొప్పున పబ్లిష్ చేస్తున్నారు. నేను ఇప్పటి వరకూ చదివిన కథల్లో ఝాన్సీ పాపుదేశి గారి 'మన్నుబోసే కాలం', అయోధ్య రెడ్డి గారి 'రెండు స్వప్నాల నడుమ గోడ' కథలు నాకు చాలా బాగా నచ్చాయి. మొదటి బహుమతి పొందిన కథ నా సెన్సిబిలిటీస్ కి అందలేదేమో అనుకుంటున్నాను. ఈ కథ ప్రచురించి ఇప్పటికి రెండు మూడు రోజులైంది. బ్లాగు ...